శ్రీకాకుళం జిల్లా ఉద్దానంవాసుల సమస్య పరిష్కరానికి ఐసీఎంఆర్ రంగంలోకి దిగనుంది. ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల మూలాలను పరిశోధించేందుకు ఐసీఎంఆర్ రంగంలోకి దిగుతోంది. శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్ ప్రాజెక్టు పేరుతో ఐసీఎంఆర్ ఈ కార్యక్రమం చేపట్టనుంది. మూడేళ్లలోగా పూర్తి చేయనుంది. ఈ విషయాన్ని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. త్వరలోనే ప్రాజెక్టు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. తొలివిడతగా 5 వేల మందిని ఎంపిక చేసి పరీక్షలు చేయనున్నారు.