ఉపాధి హామీ పథకం అమలుపై.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు..

2 months ago 8
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని తెలంగాణ మంత్రి సీతక్క ఆరోపించారు. పథకం పేరును ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్’ గా మార్చే బిల్లును ఆమె తప్పుబట్టారు. పేరు నుంచి గాంధీజీ పేరును తొలగించడం వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. గతంలో వంద శాతం నిధులు వెచ్చించిన కేంద్రం, ఇప్పుడు వాటాను 60 శాతానికి తగ్గించి.. 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యాయమని, ఇది రాష్ట్రాల ఆర్థిక స్థితికి హానికరమని మంత్రి డిమాండ్ చేశారు. కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
Read Entire Article