ఉపాధి హామీ శ్రామికులకు అలర్ట్.. పని కావాలంటే ఇది తప్పనిసరి..!

4 months ago 7
ఉపాధి హామీ కూలీలకు కీలక గమనిక. ఉపాధి హామీ శ్రామికులలో బోగస్ జాబ్ కార్డులను గుర్తించేందుకు కేంద్రం ఈ కేవైసీ ప్రక్రియ చేపట్టింది. కేంద్ర ఆదేశాల ప్రకారం ఏపీలో ఈ కేవైసీ ప్రక్రియ జరుగుతోంది. ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పనుల్లోకి రానివ్వమని అధికారులు చెప్తున్నారు. మరోవైపు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ కేవైసీ ప్రక్రియ ప్రారంభం కాగా.. అక్టోబర్ 19వ తేదీతో ఈ గడువు ముగుస్తోంది. అయితే నెలాఖరు వరకూ పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో ఉపాధి హామీ శ్రామికులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article