ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం విధి నిర్వహణ, పాఠ్యాంశాల బోధనలో తలమునకలై ఉండే ఉపాధ్యాయులకు కాస్త ఊరట కలిగించేలా, ఆటవిడుపు కలిగేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ ఇటీవల విడుదల చేసింది. నాలుగు స్థాయిలలో పోటీలు నిర్వహిస్తున్నారు. మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఆటల పోటీలు నిర్వహించనున్నారు. నవంబర్15 నుంచి డిసెంబర్ 15 వరకూ నాలుగు స్థాయిలలో పోటీలు జరగనున్నాయి.