హైదరాబాద్లోని ఉప్పల్ నల్లచెరువు వద్ద శనివారం వింత దృశ్యం కనిపించింది. చెరువులో నీటి మట్టం తగ్గడంతో చేపలు పట్టేందుకు స్థానికులు భారీగా ఎగబడ్డారు. పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనాలు, మురుగునీటితో నిండిన ఈ చెరువులో పెరిగే చేపలను తినడం అంటే రోగాలను కొనితెచ్చుకోవడమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. ఇక్కడ జరుగుతున్న సుందరీకరణ పనులకు తోడు ఈ చేపల వేటను చూసేందుకు జనం వాహనాలు ఆపడంతో ఉప్పల్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఉచితంగా దొరుకుతున్నాయని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.