ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. రోశయ్య రాజకీయ ప్రస్థానంలో వెన్నంటి ఉంటూ, కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించిన శివలక్ష్మి నిరాడంబరతకు మారుపేరు. ఆమె మృతి పట్లు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.