ఇటీవల కాలంలో మనుషులు చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో ఒక తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలచివేసింది. పహాడీ షరీఫ్కు చెందిన వసంత, తన భర్త చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనంతో బాధపడుతోంది. మనస్తాపంతో తన ఇద్దరు కుమారులను ట్యాంక్ బండ్ వద్దకు తీసుకువెళ్లి, ఆడుకోవడానికి వారికి ఫోన్ ఇచ్చి సాగర్లో దూకేసింది. తల్లి కోసం ఆ చిన్నారులు ఎదురుచూస్తున్న దృశ్యం అందరినీ కన్నీరు పెట్టించింది. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని.. కష్టాల్లో ఉన్నప్పుడు ఇతరుల సహాయం కోరాలని నిపుణులు సూచిస్తున్నారు. సమాజం కూడా ఇలాంటి వారిని గుర్తించి అండగా నిలవాల్సిన అవసరం ఉంది.