దాదాపు పదేళ్లుగా పెండింగ్లో ఉన్న రామగుండం–మణుగూరు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ నుండి సూత్రప్రాయ ఆమోదం లభించింది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషి ఫలితంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు కదిలింది. సుమారు రూ. 4 వేల కోట్ల వ్యయంతో ఈ మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ రైల్వే లైన్ సింగరేణి కార్మికులకు, బొగ్గు రవాణాకు, సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే వేలాదిమంది భక్తులకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. వెనుకబడిన పెద్దపల్లి నియోజకవర్గానికి ఇది చారిత్రక పరిణామమని ఎంపీ హర్షం వ్యక్తం చేశారు.