కామారెడ్డి జిల్లాలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు.. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను ఢిల్లీలో కలిశారు. స్నేహపురి కాలనీ, వికాస్ నగర్ వంటి కీలక ప్రాంతాలలో రోడ్ ఓవర్ బ్రిడ్జిలు (ROB), అలాగే పాదచారుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) నిర్మించాలని ఆయన వినతి పత్రం అందించారు. మంత్రి ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారు. త్వరలోనే రైల్వే అధికారులు స్థల పరిశీలన చేసి.. ఈ నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు.