Gudivada Bypass Road Started: గుడివాడ బైపాస్ రోడ్డు ప్రారంభమైంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.3,380 కోట్లతో కొత్త ప్రాజెక్టులు, రూ.1,081 కోట్లతో రహదారుల మరమ్మతులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఏపీలో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించారని.. నాణ్యతతో మే నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తామని మంత్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. గుడివాడ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు.