మన్నెగూడ – హైదరాబాద్ (NH 163) నాలుగు వరసల రోడ్డు నిర్మాణ పనులు ఎట్టకేలకు ఊపందుకున్నాయి. ఇటీవల జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం (21 మంది మృతి) తరువాత.. రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులపై దృష్టి సారించింది. గతంలో పర్యావరణ అనుమతుల కోసం ‘ఎన్జీటీ (NGT)’లో నమోదైన కేసు కొలిక్కి రావడంతో.. రూ. 1,138 కోట్ల ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ దూరం పనులను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేస్తామని ఎన్ హెచ్ ఏఐ (NHAI) అధికారులు తెలిపారు.