Palasa Railway Flyover Ugadi: పలాస ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి! వచ్చే ఉగాదికి రైల్వే ఫ్లైఓవర్, కొత్త రైతు బజార్ అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు పనులను పరిశీలించి, వేగవంతం చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని, నిధులు దారి మళ్లించిందని విమర్శించారు. మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రోడ్ల పనుల్లో జాప్యంపై ఫిర్యాదులు అందగా, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు