Kanigiri New Railway Station Trail Run: ఆంధ్రప్రదేశ్లో నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్లో భాగంగా కనిగిరి కొత్త రైల్వే స్టేషన్ సిద్ధమైంది. పదేళ్లుగా నిలిచిపోయిన ఈ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వ చొరవతో ఊపందుకుంది. అత్యాధునిక సౌకర్యాలతో సిద్ధమైన ఈ స్టేషన్కు ఈ నెల 30న ట్రయల్ రన్ జరగనుంది. ఈ నడికుడి - శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్ పూర్తయితే ప్రయాణ సౌకర్యం మెరుగుపడి, హైదరాబాద్-తిరుపతి మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది.