nris srivari seva: తిరుమల శ్రీవారి సేవలో ఎన్నారైలకు ప్రత్యేక అవకాశం కల్పించే యోచనలో ఉన్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గోమాత సేవ కోసం 'గో సేవ' పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, తిరుమలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు టీటీడీ పట్టణ ప్రణాళిక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు పలు ఆలయాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.