Chinturu Hospital Upgrade 100 Beds: పోలవరం జిల్లా చింతూరులో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.3.44 కోట్లు విడుదల చేసి, కొత్త వైద్య నిపుణులతో పాటు అదనపు పోస్టులు మంజూరు చేశారు. దీంతో ముంపు మండలాల ప్రజలతో పాటు, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు గ్రామస్తులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇది స్థానికులకు ఎంతో ఊరటనిచ్చే పరిణామం.