ప్రభుత్వం ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని ఆ యువతి రేయి, పగలు కష్టపడి చదివింది. తాను గవర్నమెంట్ టీచర్ అయితే తన భవిష్యత్ను తీర్చుదిద్దుకోవడం మాత్మే కాకుండా.. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చి దిద్దాలని ఆశపడింది. ఏపీ సర్కార్ ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో అర్హత సాధించింది. త్వరలోనే ఉద్యోగంలో చేరేందుకు అంతా సిద్ధం కాగా.. అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. క్యాన్సర్ మహమ్మారితో ఆ యువతి కన్నుమూయడంతో.. ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.