తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు స్పీకర్కు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది. ఆలస్యంపై వివరణ కోరుతూ, నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉండటంతో ఈ వ్యవహారం మళ్లీ వేడెక్కింది.