ఎర్రవల్లిలో సర్వే నంబర్ 325లోని 388 ఎకరాల భూములపై రెవెన్యూ అధికారుల సర్వే కొనసాగుతున్న వేళ మరో అంశం తెరపైకి వచ్చింది. ఈ భూముల్లో సుమారు 180 ఎకరాలు తమ గ్రామానికి చెందినవేనని శివారు వెంకటాపూర్ గ్రామస్థులు వాదిస్తున్నారు. ఎర్రవల్లి గ్రామానికి 250 ఎకరాలు మాత్రమే చెందుతాయని.. పాత ఖాస్రా, సేత్వార్ రికార్డుల ఆధారంగా హద్దులను నిర్ధారించాలని వారు కోరుతున్నారు. మరోవైపు సర్వే నంబర్ 325లో సాగు చేస్తున్న 215 మంది రైతులకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు.