పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించడానికి భారీ రాయితీలు అందిస్తోంది. EV కొనుగోలుదారులకు మొక్కలు బహుమతిగా ఇవ్వాలని, ప్రభుత్వ శాఖల్లో 20 శాతం EVల కొనుగోలు తప్పనిసరి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణతో పాటు రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని కంపెనీలను కోరారు.