EV Charging Stations in Hyderabad: కాలుష్యాన్ని తగ్గించేందుకు హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రానున్న ఆరు నెలల్లో నగరంలో 2,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని టీజీఎస్పీడీసీఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్ వంటి పలు ప్రాంతాల్లో ఈ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీలు అందిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం 100 శాతం రాయితీని కల్పిస్తోంది.