ఎల్బీనగర్ - హయత్నగర్ మధ్య మెట్రో విస్తరణను డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్తో అనుసంధానించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 5.5 కి.మీ మేర ఒకే పిల్లర్పై నేషనల్ హైవే, మెట్రో లైన్ నిర్మించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు పాత మెట్రో డీపీఆర్లో మార్పులు చేస్తూ.. కేంద్రం నుంచి అనుమతులు పొందేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనివల్ల భూసేకరణ ఇబ్బందులు తగ్గి, ప్రయాణం సులభతరం కానుంది.