రాయదుర్గం భూముల విషయంలో ఎస్బీఐ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం రోజురోజుకూ తీవ్రం అవుతోంది. ఆ భూమి తమదే అంటూ ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం స్టే ఇచ్చింది. ఈ క్రమంలోనే ఎస్బీఐ తీరుపై రేవంత్ సర్కార్ తీవ్రంగా మండిపడింది. ఆ భూమిని తాము గతంలోనే కొన్నామని.. అందులో కొంత భాగం తమదేనని కోర్టును ఆశ్రయించింది. ఈ వివాదంతో ప్రభుత్వానికి ఎస్బీఐలో ఉన్న అకౌంట్లను ఇతర బ్యాంకులకు మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.