కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నూకరాజు భార్య మీనా మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ బలగాలు గుర్తించాయి. ధవళేశ్వరం బ్యారేజీకి 30 కిలోమీటర్ల దూరంలో మూలస్థాన అగ్రహారం వద్ద గోదావరి నదిలో మీనా మృతదేహం లభ్యమైంది. ఇప్పటికే నూకరాజు. అతని కుమార్తె సౌజన్య మృతదేహాలు లభ్యమైన సంగతి తెలిసిందే.