AP Free Bus Scheme New Buses: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, వారి కార్యదర్శులతో అమరావతిలో కీలకమైన సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు కూడా వర్చువల్గా ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు కొత్తగా వెయ్యి ఈవీ బస్సుల్ని కొనుగోలు చేయాలని సూచించారు. అంతేకాదు విద్యుత్ ఛార్జీలను కూడా తగ్గిస్తామని తెలిపారు. అంతేకాదు ఆయా శాఖలకు సంబంధించి సీఎం చంద్రబాబు అధికారులకు కొన్ని కీలక సూచనలు చేశారు.