AP IAS Officers Wife Dies Under Suspicious: ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐఏఎస్ అధికారి జీకే కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక (42) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి అకస్మాత్తుగా మరణించారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమెకు గొంతు ఇన్ఫెక్షన్ కూడా రావడంతో ఆసుపత్రిలో చేరారు. ఆమె మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.