వచ్చే ఏడాది జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం ఇదివరకే చెప్పింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ప్రస్తుతం సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా టెట్ నిర్వహించాలని.. వారు రెండేళ్లలో టెట్ పాసవ్వాలని సుప్రీంకోర్టు తీర్పుతో వల్ల సందిగ్ధం నెలకొంది. వీరికి కూడా ఈసారి టెట్లో అవకాశం కల్పించాలా లేదా అనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది ప్రభుత్వం. ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచిస్తోంది.