స్వదేశ్ దర్శన్ 2.0, ప్రసాద్ పథకాల కింద మొత్తం రూ. 419.30 కోట్లతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. స్వదేశ్ దర్శన్ పథకంలో రూ. 152 కోట్లతో ఇప్పటికే అరకు గుహలు, సూర్యలంక బీచ్ అభివృద్ది చేయడంతో పాటు నాగార్జునసాగర్ వద్ద బుద్దిస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా నిర్మిస్తున్నారు. భవిష్యత్లో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో రూ. 101.07 కోట్లతో అరకు కల్చరల్ ఎక్స్పీరియన్స్ సెంటర్, శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధి చెందిన అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయ పరిసరాలు, గన్నవరం మైస్ సెంటర్ ఏర్పాటు, నెల్లూరు జిల్లాలో వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి చేయనున్నారు.