AP Govt On GST MRP Revisions: జీఎస్టీ తగ్గింపుతో ఆంధ్రప్రదేశ్లో ఎమ్మార్పీ ధరలు మారాయి. పాత ప్యాకేజీల వల్ల వినియోగదారులకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2026 మార్చి 31 వరకు పాత ఎమ్మార్పీ స్టిక్కర్లతో అమ్మకాలకు అనుమతించింది. సెప్టెంబర్ 22 కంటే ముందు తయారైన వాటిపై కొత్త స్టిక్కర్లు తప్పనిసరి కాదు. ధరలు తగ్గితే వినియోగదారులకు సమాచారం ఇవ్వాలని, ఎక్కువ వసూలు చేస్తే 1967కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.