ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల మూడు నుంచి (నవంబర్ 3) రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పలు జిల్లాల్లో సమ్మె నోటీసులు ఇచ్చారు. రెండేళ్లుగా విధులలో ఉంటూ మరణించిన కార్మికులు, అలాగే రిటైర్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబసభ్యులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధుల్లోకి తీసుకోవాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటుగా పలు సమస్యలను పరిష్కరించాలంటూ సమ్మె నోటీసులు ఇస్తున్నారు.