Narasapur Chennai Vande Bharat Train (20677/20678) Schedule Details: విజయవాడ-చెన్నై వందేభారత్ రైలు ఇకపై నరసాపురం వరకు నడుస్తుంది. ఈ నెల 15 నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చొరవతో ఈ పొడిగింపు సాధ్యమైంది. నరసాపురం నుంచి చెన్నైకు వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు షెడ్యూల్ వివరాలను ఆయన ట్వీట్ చేశారు. నరసాపురం ప్రజల చిరకాల డిమాండ్ నెరవేరడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.