ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. రేషన్ కార్డు ఉన్నవారికి అవి మళ్లీ ఇస్తున్నారు.. ఈ నెల నుంచే

3 months ago 11
పేదల కోసం రేషన్ బియ్యంతో పాటు పోషక విలువలున్న తృణధాన్యాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో రాగులు, జొన్నలను కూడా ఉచితంగా అందిస్తోంది ప్రభుత్వం. ఈ పథకాన్ని ఇప్పుడు ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ ప్రారంభిస్తున్నారు. కొంత బియ్యానికి బదులుగా తృణధాన్యాలను కూడా రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తున్నారు. రాగులు జొన్నలపై ప్రజలు ఆసక్తి కనబరుస్తుండటంతో.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో తృణధాన్యాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో కూడా రాగులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
Read Entire Article