AP All Citizen Services Through Mana Mitra: రాష్ట్ర ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలను వచ్చే సంక్రాంతి నుంచి ఆన్లైన్లోనే అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పారదర్శకత పెరిగి, ప్రజల సంతృప్తి స్థాయి పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. మనమిత్ర వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తూ, ప్రజల సమయం ఆదా చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని, పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.