AP Electricity Bill Reduce Offer Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్తు వినియోగదారులకు బంపరాఫర్ ప్రకటించింది. స్వచ్ఛంద అదనపు లోడ్ వెల్లడి పథకాన్ని డిసెంబరు వరకు పొడిగించింది. దీని కింద అదనపు లోడ్ను క్రమబద్ధీకరించుకుంటే, డెవలప్మెంట్ ఛార్జీల్లో 50 శాతం రాయితీ లభిస్తుంది. తనిఖీలో పట్టుబడితే పూర్తి మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. డిస్కమ్లపై భారం తగ్గించి, సరఫరా అంతరాయాలు నివారించేందుకు ఈ పథకం కీలకం. ఇప్పటికే రూ. 5.66 కోట్ల ఆదాయం వచ్చింది.