AP Special Tour Package For Pancharama Darshan: కార్తీకమాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ, ఆర్టీసీలు భక్తులకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాయి. ఏపీ టూరిజం విజయవాడ నుంచి పంచారామాలకు బస్సులు నడుపుతోంది. ఈ మేరకు కొత్త ప్యాకేజీలను ప్రకటించింది. పంచారామాలకు, శబరిమల, శ్రీశైలం యాత్రలకు ప్రత్యేక బస్సులు అందుబాటులోకి వచ్చాయి. విజయవాడ, కోనసీమ, విజయనగరం నుంచి ఈ సౌకర్యాలు కల్పించారు. ఆన్లైన్లో, బస్టాండ్లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్లు భక్తులకు సౌకర్యవంతంగా ఉంటాయి.