ఏపీలో వైద్యలు సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ కింద అందించే సేవలు నిలిపివేయనున్నట్లు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. తమకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించనందునే.. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పాయి. ఈ విషయంపై ప్రభుత్వంతో ఎన్నిసార్లు మాట్లాడిన ఫలితం రాలేదన్నాయి. బకాయిలు చెల్లించక ప్రైవేటు ఆసుపత్రులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించాయి. అయితే దీనిపై ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని చెప్పారు.