ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. రోగులకు ఇంటి వద్దనే వైద్యం అందించే సంజీవని పథకాన్ని అమలు చేయనుంది. దీని ద్వారా వైద్య సిబ్బంది ఇంటికే వచ్చి వైద్య సేవలు అందిస్తారు. బిల్గేట్స్ ఈ కార్యక్రమానికి సహకారం అందించేందుకు ముందుకు వచ్చారని సీఎం చంద్రబాబు తెలిపారు. కుప్పంలో పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో, ప్రస్తుతం చిత్తూరులో దీన్ని ప్రారంభించారు. త్వరలోనే రాష్ట్రం అంతా అమలు చేయనున్నారు. ఆ వివరాలు..