గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 'ఆరోగ్య రథం' పథకాన్ని అమలు చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ వాహనాల్లో 47 రకాల పరీక్షలు చేస్తూ, ఆరోగ్య వివరాలను ఎలక్ట్రానిక్ రికార్డుల్లో నమోదు చేస్తారు. ప్రస్తుతం ఉన్న మొబైల్ మెడికల్ యూనిట్ల సమస్యలను పరిష్కరించి.. త్వరలోనే మారుమూల ప్రాంతాలకు కూడా నాణ్యమైన వైద్యం అందించడమే దీని లక్ష్యం. కుప్పంలో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ పథకం త్వరలో రాష్ట్రమంతా విస్తరించనున్నారు.