ఆంధ్రప్రదేశ్లో పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. టిడ్కో ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటుంది. అన్నమయ్య జిల్లాలో దీపావళి నాటికి 12,571 ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తూ, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, పేదల ఆశలకు కొత్త ఊపిరి పోస్తోంది.