AP Govt Employees Da Go Released: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పింఛనర్లకు దీపావళి కానుకగా డీఏ అలవెన్స్ను 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో పాటు, పోలీసులకు సరెండర్ లీవ్స్ డబ్బులు, ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ వంటి అనేక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులు కూడా సంతోషంలో ఉన్నారు.