ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలను తీసుకు రావడం కోసం తీవ్రంగా కృషి చేస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే కంపెనీలకు అనేక ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో విశాఖలో ఏర్పాటు చేయబోయే గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున ప్రోత్సాహకాలు అందించేందుకు ముందుకు వచ్చింది. తక్కువ ధరకు భూములు కేటాయించడంతో పాటు.. విద్యుత్, రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు వంటి వాటిని కలుపుకుని.. రూ.22 వేల కోట్లకు పైగా ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. ఆ వివరాలు..