ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పేదలకు శుభవార్త వినిపించారు. ఉగాది రోజున మరో ఐదు లక్షల గృహప్రవేశాలు చేయించనున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. త్వరలోనే రాష్ట్రంలో మరో 700 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే 5 లక్షల ఇళ్లల్లో గృహప్రవేశాలు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 15 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.