ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లా దగదర్తిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం దామవరం వద్ద 418 ఎకరాల భూసేకరణ చేపట్టాలని కూడా ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. తాజాగా భూసేకరణకు సంబంధించి రైతులకు అందించాల్సిన పరిహారం నిర్ణయించింది. ఎకరాకు 13 లక్షల రూపాయలు చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించింది. మరోవైపు 916 కోట్లతో దగదర్తి ఎయిర్పోర్టు తొలివిడత పనులు చేపట్టనున్నారు.