Free Power to Ganesh Pandals in Andhra Pradesh: గణేష్ పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గణేశుడి మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది. గణేష్ మండపాలు, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వినతులను పరిశీలించిన తర్వాత .. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్తో చర్చించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్లు నారా లోకేష్ వెల్లడించారు.