ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దోమల బెడదను నివారించడానికి సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. కృత్రిమ మేధస్సు ఆధారిత స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ను విజయవాడ, విశాఖ, కర్నూలు, నెల్లూరు, కాకినాడ, రాజమండ్రి నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ వ్యవస్థ ద్వారా దోమల ఉత్పత్తి ప్రాంతాలను గుర్తించి డ్రోన్ల ద్వారా రసాయనాలు పిచికారీ చేసి దోమలను నియంత్రిస్తారు.