AP Govt Ntr Bharosa Scheme 200 New Pensions Every District: కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జిల్లాకు 200 చొప్పున కొత్త పింఛన్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులకు ఈ పింఛన్లు అందనున్నాయి. ఇంఛార్జ్ మంత్రి, జిల్లా కలెక్టర్లు కలిసి నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ పనితీరును సీఎం ప్రశంసించారు.