సాగరతీరం విశాఖపట్నం అభివృద్ధి మీద ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా ముంబై తరహాలో విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ నుంచి అధికారుల బృందం ముంబైలో పర్యటించింది. సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ విధానాలను అధ్యయనం చేసింది. ఆ విధానాలను ఇక్కడ అమలు చేసేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించనున్నారు.