విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టులపై కీలక అప్ డేట్ వచ్చింది. మెట్రో రైలు ప్రాజెక్టుల టెండర్లు దరఖాస్తు గడువును ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇటీవల పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైల్ ప్రాజెక్టుల టెండర్లలో జాయింట్ వెంచర్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. గరిష్టంగా మూడు సంస్థలు కలిసి జాయింట్ వెంచర్ కింద టెండర్లు దాఖలు చేయవచ్చని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి వెల్లడించారు.