ఐటీ పెట్టుబడులకు విశాఖ నగరం స్వర్గధామంగా మారుతోంది. కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు వైజాగ్లో తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. డిసెంబర్ 12న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ సమక్షంలో కాగ్నిజెంట్తో పాటు పలు ప్రముఖ ఐటీ సంస్థల శాశ్వత క్యాంపస్లకు భూమి పూజ చేయనున్నారు. ఇది ఐటీ రాజధానిగా విశాఖ అభివృద్ధికి మరింత ఊతమివ్వనుంది.