ఏపీలో అరటి రైతుల సమస్యలపై అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఏపీలో కిలో అరటి 50 పైసలు మాత్రమే పలుకుతోందంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోమవారం విమర్శలు గుప్పించారు. ఈ విషయంపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అయితే వైఎస్ జగన్ ట్వీట్ మీద ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం స్పందించింది. వైఎస్ జగన్ అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించింది. డిసెంబర్ రెండో వారం నుంచి అరటి ధరలు పెరుగుతాయని.. రైతులు అపోహలను నమ్మవద్దని సూచించింది.