ఏపీలోని రైతులకు పండగలాంటి వార్త. రాష్ట్రంలో యూరియా అవసరాలను తీర్చేందుకు కేంద్రం నుంచి యూరియా ఏపీకి రానుంది. ఈ విషయాన్ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సెప్టెంబర్ నెలలో 45 వేల టన్నుల యూరియాను కేంద్రం ఏపీకి సరఫరా చేయనుందని వెల్లడించారు. దీంతో ఈ సీజన్లో యూరియా అవసరాలు తీరుతాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.